ఇస్తాంబుల్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది.
టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజా వివరాల ప్రకారం ఆరుగురు మృతిచెందగా.. 200 మందికిపైగా గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు అమెరికా జియోలాజిక్ సర్వే పేర్కొంది.
ఇజ్మిర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. సహాయ చర్చలు కొనసాగుతున్నట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇజ్మిర్ గవర్నర్ తెలిపారు.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని ఇస్తాంబుల్ గవర్నర్ పేర్కొన్నారు.
గ్రీస్ రాజధాని ఏథెన్స్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్కు చెందిన ద్వీపం సామోస్లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
BREAKING: A #tsunami warning has been issued after an #earthquake with a magnitude of up to 7.0 struck #Turkey's #Aegean coast, north of the Greek island of #Samos. Vision has emerged of what's reportedly tsunami-related flooding in #Seferihisar, south-west of #Izmir #deprem pic.twitter.com/EP9JGDHwkZ
— Auskar Surbakti (@AuskarSurbakti) October 30, 2020