Homeహైదరాబాద్latest News9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.. 2.71 లక్షల నగదు స్వాధీనం

9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.. 2.71 లక్షల నగదు స్వాధీనం

ఇదేనిజం, శేరిలింగంపల్లి: మాదాపూర్ చంద్రనాయక్ తండాలోని ఓ అపార్ట్మెంట్ లో పేకాట ఆడుతున్న 9 మందిని యస్ఓటీ, మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు యస్ఓటీ, మాదాపూర్ పోలీసులు పేకాట ఆడుతున్న ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు ముద్దాల వెంకట కృష్ణారావు తో పాటు మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2.71 లక్షల నగదు, 09 మొబైల్ ఫోన్ లు, 02 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img