HomeసినిమాRashmika Mandanna : ఫోన్ సిగ్న‌ల్స్ కూడా లేని ప్రాంతంలో ర‌ష్మిక‌..

Rashmika Mandanna : ఫోన్ సిగ్న‌ల్స్ కూడా లేని ప్రాంతంలో ర‌ష్మిక‌..

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. మొద‌టి సినిమాతోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది.

ఛ‌లో సినిమా త‌ర్వాత ర‌ష్మిక చేస్తున్న సినిమాల‌న్నీ మంచి విజ‌యాలు సాధించ‌డంతో అమ్మ‌డికి ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి.

ఇప్పుడు తెలుగులోనే కాదు త‌మిళం, హిందీ భాష‌ల‌లోను బిజీ అయింది.

తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలతో బిజీగా ఉన్న భామ రష్మిక మందన.. ‘మిషన్‌ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.

సిదార్థ్‌ మల్హోత్ర హీరోగా, 1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శంతన్‌ బాగ్చి దర్శకత్వం వహించారు.

ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది.

ర‌ష్మిక ప్ర‌స్తుతం పుష్ప షూటింగ్ కోసం మారేడుమిల్లికి వెళ్లింది. అటవీ ప్రాంతంలో షూటింగ్, సిగ్నల్స్ లేని ప్రాంతంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది.

అయితే ఛ‌లో సినిమాతో త‌న‌కు మంచి పేరు తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల బ‌ర్త్ డే సెప్టెంబ‌ర్ 8న కాగా, ఆయ‌న‌కు ర‌ష్మిక ఎప్పుడో రాత్రి విషెస్ తెలిపింది.

అందుకు కార‌ణం కూడా చెప్పింది. అటవీ ప్రాంతంలో షూటింగ్, సిగ్నల్స్ లేని కారణంగానే లేట్ విష్ చేశాను, అందుకు ద‌ర్శ‌కుడికి సారీ కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

Recent

- Advertisment -spot_img