Homeఫ్లాష్ ఫ్లాష్రాష్ట్ర వ్యాప్తంగా బ‌యో పెట్రోల్ పంపులు

రాష్ట్ర వ్యాప్తంగా బ‌యో పెట్రోల్ పంపులు

కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు బయో పెట్రోల్ వినియోగించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో బయో పెట్రోల్ పంపులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆగ్రో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ కొరకు బయో పెట్రోలు ప్రతి ఒక్కరు వాడాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయో పెట్రోలు ఉత్పత్తులను పెంచి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బయో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img