టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేశ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీకి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్గా ‘వెంకీ 75’ పేరుతో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్కు ఎంతోమంది ప్రముఖ సినీ నటులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరై ఆకట్టుకున్నారు. అయితే, ఈవెంట్లో విక్టరీ వెంకటేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే సినిమాలు మానేసి, హిమాలయాలకు వెళ్లి ఉండే వాడిని అంటూ చెప్పుకొచ్చారు. 9 సంవత్సరాల తర్వాత విరామం నుండి తిరిగి వచ్చిన చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ అందించడం చూసి, ఈ నటన కొనసాగించాలని తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. వెంకీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.