– టీచర్లకు డీఈవో రామారావు సూచన
ఇదే నిజం, నెల్లికుదురు: టీచర్లు సమయపాలన పాటించాలని డీఈవో రామారావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని యూపీఎస్ను రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. టీచర్లు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావొద్దని సూచించారు. కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల హెచ్ఎంలు కే వెంకటయ్య, ఉపాధ్యాయుడు బేతి మధు తదితరులు పాల్గొన్నారు.