ఇదేనిజం, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి నగర్ మేయర్ విజయలక్ష్మి కీలక ప్రకటన చేశారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగానే డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయలేకపోయామని మేయర్ చెప్పారు. ఇందుకు సంబంధిత అధికారులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కొత్తగా ఇళ్ల మంజూరు కోసం జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఇతర ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మేయర్ ఆదేశించారు.