ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల లో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని.. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి నెల చివరి వరకు రైతుభరోసా ద్వారా నగదు కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు.