4జీ, 5జీ రాకతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ డిజిటలైజేషన్ వేగంతో పాటు, డిజిటల్ నేరాలు కూడా విపరీతంగా పెరిగాయి. అలాంటి ప్రమాదం గురించి ప్రభుత్వం, ఇంటర్నెట్ వినియోగదారులను హెచ్చరించింది. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం గురించి ప్రజలను హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా సమస్యలు ఉన్నాయని సెర్ట్-ఇన్ చెబుతోంది. అలర్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ని ఉపయోగిస్తున్న వినియోగదారులందరూ వెంటనే తమ బ్రౌజర్ని అప్డేట్ చేయాలి. గూగుల్ క్రోమ్ అప్డేట్లో భద్రతా సమస్యలు ఉన్నాయి. ఆ లోపాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, సైబర్ అటాక్ చేసేవారు డివైస్లోకి ప్రవేశించవచ్చు. గూగుల్ క్రోమ్లోని సమస్యలను కంపెనీ పరిష్కరించింది. లోపాలను సరిచేసే భద్రతా ప్యాచ్లతో గూగుల్ క్రోమ్ కొత్త అప్డేట్ను కంపెనీ విడుదల చేసింది. ఈ కారణంగా వినియోగదారులు పాత గూగుల్ క్రోమ్ను ఉపయోగిస్తుంటే తక్షణమే కొత్త అప్డేట్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. దీంతో పాటు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నప్పుడు, వెబ్ను బ్రౌజ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని ప్రభుత్వ ఏజెన్సీ, ప్రజలను కోరింది. వినియోగదారులు తెలియన్ సోర్స్ల నుంచి వచ్చే లింక్లపై క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద వెబ్సైట్లకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసింది.