– కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి లేఖ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కు దమ్ముంటే మహబూబ్ నగర్లో పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దీంతో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి లేదంటే శ్రీనివాస్ గౌడ్ కు బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా వంశీచంద్ రెడ్డి .. కేసీఆర్ ను పోటీ చేయాలని సవాల్ విసరడం గమనార్హం. 2009 పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.