ఇదే నిజం, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి పీఎస్ పరిధిలోని లద్నాపూర్కు చెందిన షేక్ జామీల్ ఇటీవల మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. సోమవారం పోలీసులు బాధితుడికి మొబైల్ ఫోన్ అందజేశారు. ఎస్సై కాట్రపు సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జమీల్ 3 నెలల క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. బాధితుడు సీఈఐఅర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసులు మొబైల్ ఫోన్ ను గుర్తించి అతడికి అప్పగించారు.