ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా స్కై జిమ్ యాజమాన్యం సహకారంతో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ ఐరన్ మ్యాన్ 2024 విజేతలకు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, తాళ్ల గురజాల సీఐ, ఎస్సైలు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, గెలిచిన బాడీ బిల్డర్స్ కు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా స్కై జిమ్ యాజమాన్యం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బాడీ బిల్డర్స్, న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు.