ఇదే నిజం, గోదావరిఖని: చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రామగుండంలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం ఎన్టీపీసీ మల్కాపూర్ కు చెందిన పిట్టల సురేశ్ (30) శివారులోని ఎన్టీపీసీ కాల్వ వద్ద చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. సురేశ్ తల్లి బానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.