– పాలు, పండ్లు పంపిణీ చేసిన ముస్లీం యువకుడు
ఇదే నిజం , సిద్ధిపేట: మహాశివరాత్రి సందర్భంగా మత సామరస్యాన్ని చాటాడు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ఇర్షాద్ హుస్సేన్. సిద్దిపేట పట్టణంలోని శివాలయాలకు వచ్చే భక్తులకు పండ్లు, పాలు పంపిణీ చేశాడు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇర్షాద్ గత కొంత కాలంగా హిందువుల పండగలకు పాలు , పండ్లు , నీరు , మజ్జిగ అందిస్తున్నాడు. మతం కంటే మానవత్వమే గొప్పదని చాటుతున్నాడు.