ఇదేనిజం, గోదావరిఖని : సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్లోని ఎస్బీఐ బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, పిన్ నెంబర్లు ఇతరులకు తెలియజేయవద్దని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.