– కేంద్రం కీలక నిర్ణయం
– 19 వెబ్సైట్లు, 10 యాప్లు,
57 సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: అసభ్యకర కంటెంట్ను టెలికాస్ట్ చేస్తున్న ఆన్లైన్ యాప్స్, ఓటీటీలపై కేంద్రం బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 ఓటీటీ ప్లాట్ఫామ్లు, 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా అకౌంట్లను తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన యాప్లో ఏడు గూగుల్ ప్లే స్టోర్లోవి కాగా, మూడు యాపిల్ యాప్ స్టోర్లోనివిగా గుర్తించారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఫేస్బుక్లో 12, ఇన్స్టాగ్రామ్లో 17, ట్విట్టర్లో 16, యూట్యూబ్లో 12 ఉన్నట్లు తెలిపింది. రెండు రోజుల కిందట కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్ అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. తొలగించిన ఓటీటీలకు కోటికిపైగా డౌన్లోడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవి సోషల్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్కు సంబంధించిన ట్రైలర్, వీడియోలు, వెబ్లింక్లను ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్కు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు తెలిపారు. భారత్లో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగా వెబ్సిరీస్లకు ఓటీటీ అవార్డులను ప్రవేశపెట్టామన్నారు. అయితే, రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించే వాటిపై తప్పక చర్యలుంటాయని ప్రకటలో పేర్కొన్నారు.