– మల్కాజిగిరి బరిలో రాగిడి లక్ష్మారెడ్డి
– ఆదిలాబాద్ నుంచి పోటీలో ఆత్రం సక్కు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్కు ఆత్రం సక్కు అభ్యర్థిత్వాలను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఉప్పల్ టికెట్ దక్కకపోవడంతో లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 11 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.