హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్టయ్యారు. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది.