ఇదే నిజం, రామగిరి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2 లక్షల 50 వేల LOC మంత్రి శ్రీధర్బాబు ఇప్పించారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన మొల్లు శ్రేయాస్ గత కొంత కాలంగా నరాల సమస్యతో బాధపడుతున్నాడు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం మంత్రి శ్రీధర్ బాబు సంప్రదించగా సానుకూల స్పందన వచ్చింది. ఈరోజు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు LOC అందజేశారు.