ఓజీ సినిమా నుంచి పవర్ఫుల్ అప్డేట్. ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ బర్త్డే ఈ రోజు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్ పోస్టర్ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. “గంభీరా.. నువ్వు తిరిగి బొంబాయి వస్తున్నావని విన్నా. ప్రామిస్. ఇద్దరిలో ఒక తలే మిగులుతుంది” అనే డైలాగ్ అందులో ఉంది. సరిగ్గా ఇదే డైలాగ్ను ఇమ్రాన్ హష్మీ X లో పోస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ను గంభీరగా పిలుస్తూ సవాలు విసురుతున్నట్లుగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 27న గ్రాండ్గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.