అపర కుబేరుడు Gautam Adani చేతిలోకి మరో పోర్ట్ చేరింది. ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును Adani Ports & SEZ Limited రూ.3,350 కోట్లకు కొనుగోలు చేసింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్లకు దీన్ని అమ్మివేసినట్లు Shapoorji Pallonji Group తెలిపింది. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు.