Loksabha Elections 2024లో గెలుపే లక్ష్యంగా BJP దూకుడు ప్రదర్శిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులను వివిధ కారణాలతో పక్కనబెట్టింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకు మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పక్కన పెట్టిన అభ్యర్థుల్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి Pratima Bhoumik, జౌళిశాఖ సహాయ మంత్రి Darshana Jardosh ఉన్నారు.