Korutla : బీఆర్ఎస్ కు చెందిన కోరుట్ల కౌన్సిలర్ దాసరి సునిత – రాజశేఖర్ కాంగ్రెస్ లో చేరారు. నియోజక వర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని’ కౌన్సిలర్ సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కోంతం రాజు, అడేపు మధు, శీలం వేణు, హమీద్, భూమయ్య, నయీం తదితరులు పాల్గొన్నారు.