ఇదేనిజం, మెదక్ : మెదక్ వాసి రాజేష్ ఖన్నా ప్రతిష్టాత్మక జేఎన్ టీయూహెచ్ నుంచి డాక్టరేట్ పొందారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రాజేష్ ఖన్నా.. పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ డ్రైవ్స్ స్పెషలైజేషన్లో చేసిన పరిశోధనలకు గాను జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు డాక్టరేట్ని ప్రధానం చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పునరుత్పాదక ఇంధనాలపైన ఆధారపడుతున్న తరుణంలో.. రాజేష్ ఖన్నా డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ సిస్టమ్స్, సోలార్, విండ్, తదితర హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి అంశాలపై ఆయన పరిశోదనలు చేశారు. డాక్టరేట్ అందుకున్న రాజేష్ ఖన్నాను పలువురు అభినందించారు.