Hyderabad : బాలాపూర్ పీఎస్ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి తెచ్చిన నకిలీ నోట్లు స్వాధీనం. రూ.25 లక్షల నోట్లను మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్ హరుణ్, సయ్యద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ అఫ్తాబ్ అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డ ముఠా.