కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి, శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తరుణ్ కార్తీకేయన్ను ఆమె పెళ్లాడారు. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, నయనతార, విఘ్నేష్ శివన్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఐశ్వర్య మొదటి భర్త రోహిత్తో విడాకులు తీసుకుని విడిపోయారు. 2021లో దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే, ఓ లైంగిక వేధింపుల కేసులో అతడికి సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రోహిత్తో ఐశ్వర్య విడాకులు తీసుకొని విడిపోయింది. ఇప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీకేయన్ను వివాహం చేసుకుంది.