అయోధ్యలోని రామ మందిర్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది. .సూర్యకిరణాల గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదిటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో, ఐదు నిమిషాల పాటు ప్రసరించనున్నాయి. ఏటా నవమి రోజున ఇలా జరిగేలా ఆలయాన్ని నిర్మించారు.