ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్ గారు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్ పోస్టర్ను జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపోందించిన ఈ వాల్ పోస్టర్లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్తో అవగాహన పోస్టర్లను రూపొందించారు.
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటోందని, దాని వల్ల వారి జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని, గంజాయి రహిత జిల్లా కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి అడ్మిన్ ప్రభాకర్ రావు, అసిఫాబాద్ డిఎస్పి సదయ్య , అసిఫాబాద్ టౌన్ సీఐ సతీష్ , డిసిఆర్బి సిఐ రమేష్ , ఆర్ ఐ అడ్మిన్ పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.