ఇదేనిజం, హైదరాబాద్ : రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, రవాణా దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒకచోట అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా పటాన్చెరులోని పాశమైలారంలో అక్రమంగా నిల్వ చేసిన 500 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. 3 లారీలు, 4 డీసీఎంలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 1.05 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను తీసుకొని ప్రత్యేక రైస్మిల్లుల ద్వారా రీసైక్లింగ్ చేస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.