ఛత్తీస్గడ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. దేశంలో 2004-14తో పోలిస్తే 2014-23లో వామపక్ష తీవ్రవాద హింస 52 శాతం, మరణాల సంఖ్య 69 శాతం తగ్గాయని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ముందస్తు ఆపరేషన్ల ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని ఓ అధికారి ఈ సందర్భంగా తెలిపారు.