ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 9,111 రైళ్లను నడపబోతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 వేసవితో పోలిస్తే.. 6,369 అదనపు రైళ్లను ఇప్పుడు నడపనుంది. 9,111 అదనపు రైళ్లలో గరిష్టంగా 1,878 రైళ్లను పశ్చిమ రైల్వే నడపనుంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే 1,623, దక్షిణ మధ్య రైల్వే 1,012, తూర్పు మధ్య రైల్వే 1,003 రైళ్లను అదనంగా నడపనుంది.