యూజీసీ నెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. మొత్తం 83 సబ్జెక్టులకు గాను నిర్వహించే ఈ పరీక్ష పెన్ను, పేపర్ విధానంలో ఆఫ్లైన్లో ఉండనుంది. జూన్ 16 న పరీక్ష జరగనుంది.
మే 10 రాత్రి 11.50గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
- అప్లికేషన్ రుసుంను మే 11 నుంచి 12 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు.
- దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 13 నుంచి 15వరకు సరిచేసుకోవచ్చు.
- అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.
- వయో పరిమితి: జేఆర్ఎఫ్కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ వయో పరిమితి ఏమీ లేదు.
- పరీక్ష ఇలా: పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 180 నిమిషాల పాటు జరుగుతుంది. పేపర్లు ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు లేవు.