ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. పదో తరగతి పరీక్షల చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి అనే విద్యార్థిని 600కు 599 మార్కులు సాధించి కొత్త రికార్డు సృష్టించింది. సెకండ్ లాంగ్వేజ్ (99 మార్కులు) తప్ప.. మిగితా అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించింది. మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. సదరు విద్యార్థినికి అభినందనలు తెలుపుతున్నారు.