తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీకి చెప్పి మరికొన్ని ఈవీఎంలను తెప్పిస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ను ముద్రిస్తున్నారని తెలిపారు. ఎల్లుండి నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని ఆయన తెలియజేశారు. హైదరాబాద్లో 3,986 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది, సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్ వాడుతున్నామని తెలిపారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు, ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఒక ఈవీఎం వాడుతున్నాం అని ఆయన వెల్లడించారు.