తెలుగు రాష్ట్రాల్లో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్లను ఏర్పాటు చేశారు. దీంతో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. మే 10 నుంచి 14 వరకు అదనంగా థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.