టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్తో రామ్ డబుల్ ఇస్మార్ట్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రామ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడని టాక్ . నెట్ఫ్లిక్స్తో కలిసి రామ్ పోతినేని ఒక వెబ్సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్పై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తుంది. అయితే ఇది మాత్రం తన ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. అలాగే రామ్ పోతినేని ఇపుడు చేస్తున్న “డబుల్ ఇస్మార్ట్” చిత్రాన్ని మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఛార్మి, పూరీలు నిర్మాణం వహిస్తున్నారు అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.