ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడింది..ఎవరికి వారు ప్రచారంలో బిజీ ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రచారంలో పాల్గొంటూ రాజకీయ వాతావరణం మరింత హీటెక్కిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లి సురేఖమ్మ, అల్లు అరవింద్ కలిసి రామ్ చరణ్ శనివారం పిఠాపురంకి వెళ్లారు. అక్కడి కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇంటికి రామ్ చరణ్ చేేరుకున్నాడు. ఇక్కడ రామ్ చరణ్ను చూసేందుకు వేల మంది అభిమానులు పడిగాపులు కాశారు. ఇక బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.