పదమూడేళ్లు సీఎంగా, పదేళ్లు పీఎంగా పనిచేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. ఇండియా కూటమి పేరుతో మేం ఓట్లు అడుగుతుంటే.. మోదీ పేరుతో బీజేపీ ఓట్లడుగుతోంది. ఎవరు నామ్దార్.. ఎవరు కామ్దార్ దీన్నిబట్టి తెలుస్తోంది’’ అని తెలిపారు.