ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఖాయమని కేంద్రమంత్రి, ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ పోలింగ్తో తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో బీజేపీ సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. సమ్మక్క, సారక్క యూనివర్సిటీ, పసుపుబోర్డు, టెక్స్టైల్ పార్క్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను మోడీ తెలంగాణకు ఇచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తొందరలోనే వీటిని మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ కుటిల ప్రయత్నాలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. వారి మాటలను ఆ పార్టీ కార్యకర్తలే సీరియస్గా తీసుకోలేదన్నారు. మోడీ ప్రధానిగా ఉండాలని ప్రజలు భావించారన్నారు. అర్బన్ ఏరియాలతో పాటు పల్లెల్లోనూ ఈసారి బీజేపీకి ఓట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకే అనుకూలంగా ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సెలబ్రిటీలు కూడా క్యూలో నిలబడి ఓటేశారని, వారు లైన్లో నిలబడి ఓటేయడం మంచి సందేశమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.