సీఎం రేవంత్ ఈరోజు(మే 21) సాయంత్రం 5 గంటలకు కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి ఆయన అక్కడే బస చేసి, రేపు (మే 22) ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి రానున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తిరుమల పర్యటనతో నేడు రేవంత్ రెడ్డి పలు శాఖలపై నిర్వహించాల్సిన సమీక్షలు, ఇతర కార్యక్రమాలు రద్దయినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.