మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. స్వయంగా మంత్రే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇక, నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ వేపచెట్టు సుమారు 20 నుంచి 25 ఏళ్లు.. ఈ ఏడాది ముఖ్యమంత్రి నివాసం తర్వాత ప్రహ్లాద్ పటేల్కు ఈ బంగ్లా లభించింది. B-7 బంగ్లా భోపాల్లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్స్లో ఉంది. బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలు ఉన్నాయి. అందులో ఒక వేప చెట్టు కూడా ఉంది. నిజానికి ఈ బంగ్లా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. దీనిని పరిశీలించేందుకు మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ శనివారం ఇక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో మామిడికాయలు వేలాడుతున్న వేపచెట్టుపై అతడి కళ్లు పడ్డాయి. ఇది చూసి అతను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు.