మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో దారుణం జరిగింది. కుటుంబ పెద్ద ఇంట్లోని 8 మందిని చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. బోదల్కల్ గ్రామానికి చెందిన ఆ వ్యక్తికి మానసిక సమస్యలున్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.