ప్రేమలు సినిమాతో మమిత బైజూ(Mamitha Baiju) తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు తమిళ్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసింది. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ‘లవ్టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా ఎంపికైంది.