పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1న ఫింఛన్ నగదును లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, వీల్ఛైర్లోనే ఉండే వారికి మాత్రం ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్ని జమ చేశారు. ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.