అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు యాజమాన్యం గుడ్న్యూస్ చెప్పింది. రోజుకు 50 వేల మంది భక్తులను దర్శనం కోసం అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ఆన్లైన్ ద్వారా కేవలం పది రోజుల ముందు నుంచే బుకింగ్ ఉండేది. ప్రస్తుతం మూడు నెలల ముందునుంచే బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. శబరిమల యాత్రకు తరలివచ్చే యాత్రికులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఇన్సూరెన్స్ అందించనున్నారు. దీనికోసం రూ. 10 ఛార్జ్ చేస్తారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారీకేడ్ల ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు.