పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్పాయ్గుడిలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు.. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దీంతో రెండు బోగీలు గాల్లోకి లోచాయి. మరో నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ లోపం కారణంగా ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.