తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ సాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యాసంస్థలు దివ్యాంగులకు 5శాతం సీట్లు ఇవ్వాలని ఆ ఉత్తుర్వుల్లో పేర్కొంది. అలాగే ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఐదేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలించింది.