తమిళనాడు తూత్తుకుడిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మేఘ్నాపురానికి చిత్తిరై సెల్విన్ దంపతులు గతనెల 17న కూతురి ఇంటికి వెళ్లగా..ఓ దొంగ ఇంట్లోకి చొరబడి రూ.60వేలు, నగలు దోచుకెళ్ళాడు. అనంతరం ‘‘నన్ను క్షమించండి. నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను. మాఇంట్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది. అందుకే దొంగతనం చేశాను’’ అని లేఖ రాసి ఉంది. అది చూసిన పోలీసులు, సెల్విన్ దంపతులు ఆశ్చర్యపోయారు.