Homeహైదరాబాద్latest Newsగుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

గుర్రపుడెక్క తొలగింపు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఇదే నిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల చాకలి చెరువులో పెరిగిన గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎంటమాలజీ ఏఈ కిరణ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..గుర్రపు డెక్క పెరగడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. దోమల నివారణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు గుర్రపుడెక్క తొలిగింపు పనులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దోమలు ఉత్పత్తి కాకుండా ఉండేందుకు గాను లార్వా దశలోనే నిర్మూలించేందుకు చెరువులో స్ప్రే చేయిస్తున్నామన్నారు. పరిసర ప్రాంతలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ కిరణ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img