అప్పుడే పుట్టిన నవజాత కవల బాలికలు అనుమానాస్పదంగా మరణించారు. పసి పాపల గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మెంధార్ సబ్ డివిజన్లోని చైజ్ల కయాని గ్రామంలో నవజాత కవల బాలికల గొంతు కోసి చంపారు. అయితే ఆడ పిల్లలు పుట్టారన్న నిరాశతో కన్న తండ్రి మహ్మద్ ఖుర్షీద్ వారిని చంపి ఉంటాడని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..